10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మణిదీప్ ఎంపిక

29-09-2025 08:01 PM

మందమర్రి (విజయక్రాంతి): ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో పట్టణంలోని తెలంగాణ మోడల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి పి.మణిదీప్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా డీఐఈఓ కే అంజయ్య తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని సోమవారం ఆయన అభినందించి మాట్లాడారు పట్టణంలోని మోడల్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణిదీప్ ఫుట్‌బాల్‌ పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. అక్టోబర్ 2 నుండి 12వ తేదీ వరకు శ్రీనగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు, కాలేజీకి పేరు తీసుకురావాలని కోరారు. కాగా రాష్ట్ర స్థాయి జట్టుకు కోచ్ గా గాలిపెళ్లి సురేందర్ వ్యవహరించనున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మణిదీప్ ను ఒలింపిక్ అసోసియేషన్, ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి రఘునాథరెడ్డి, ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావులు అభినందించారు.