18 July, 2026 | 12:30 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

భార్యాపిల్లలను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష

21-11-2025 12:00 AM

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

2019 కన్యలాల్ బాగ్‌లో ఘటన

వికారాబాద్, నవంబర్ -20 (విజయక్రాంతి): భార్య, పిల్లలను దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ గురువారం వికారాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం రాజయ్య తీర్పు ని చ్చారు. 2019 ఆగస్టు 4న వికారాబాద్ పట్టణంలోని కన్యలాల్ బాగ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాండూరుకు చెం దిన ప్రవీణ్‌కుమార్ అప్పట్లో హైదరాబాద్ శివారులోని శేర్‌లింగంపల్లిలో నివాసం ఉండే వాడు.

అదే ప్రాంతానికి చెందిన చాందిని అనే వివాహిత తనకు పరిచయం కావడం తో ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.  దీంతో భర్తను వదిలేసి కొడుకుతో కలిసి ప్రవీణ్‌కుమార్ వెంట వ చ్చింది. పెళ్లి చేసుకున్న ప్రవీణ్‌కుమార్ ఐదేళ్లపాటు అన్యోన్యంగా ఉన్నారు. వారికి ఓ కూతురు కూడా ఉంది. మద్యానికి బానిసైన ప్రవీణ్‌కుమార్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019 ఆగస్టు 3న ప్రవీణ్‌కుమార్ తల్లి, సోదరుడు  మద్యం సేవి స్తుండటం చూసిన చాందిని ఆగ్రహించింది.

దీంతో ప్ర వీణ్ కుమార్.. అదే రోజు చాందినితోపాటు కుమారుడు, కూతురిని హత్య చేశా డు.అప్పటి డీఎస్పీ సీతారాం, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు కేసు నమో దు చేసి ప్రవీణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన జిల్లా కోర్టు నేరం రుజువు కావడంతో ప్రవీణ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్‌రెడ్డి శిక్ష పడేలా కృషి చేశారని ఎస్పీ నారాయణ రెడ్డి చెప్పారు.