మల్కాజిగి ఎంపీ ఈటలను కలిసిన మల్లాపూర్ బీజేపీ నేతలు
కుషాయిగూడ ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను మంగళవారం ఉదయం మల్లాపూర్ డివిజన్కు చెందిన బీజేపీ నేతలు బిజెపి మేడ్చల్ జిల్లా నాయకులు సంగిశెట్టి రవీంద్ర సాగర్ తో పాటు బిజెపి మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు గూడూరు శైలేష్రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు ఎనుముల మహేష్ బిజెపి మహిళా అధ్యక్షురాలు సబితా రాణి యాద వ్ యాదగిరిచారి రాజేష్ పటేల్ రాజు శ్రీకాంత్రెడ్డి, కేశవరం సీతా ఆంజనేయులు తదిత రులు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు మల్లాపూర్ డివిజన్లో నెలకొన్న సమస్యలపై బిజెపి మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు సంగిశెట్టి రవీంద్ర సాగర్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు బిజెపి పార్టీకి అభివృద్ధికి చేస్తున్న కృషిని రవీంద్ర సాగర్ను ఈటల రాజేందర్ అభినందించారు.






