04-02-2026 03:35:53 PM
హైదరాబాద్: విద్యుత్ కనెక్షన్ల జారీలో భారీ మార్పులు తీసుకోచినట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. కనెక్షన్ల జారీలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు విద్యుత్ స్తంభాలు, లైన్స్ కోసం దూరాన్ని బట్టి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని, ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు టీజీఈఆర్సీ తెలిపింది. అంటే కిలోవాట్ విద్యుత్ కనెక్షన్ కు రూ.500 ఛార్జీ, ఒకటి నుంచి ఐదు కిలోవాట్ల వరకు రూ.3500 వరకు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టీజీఈఆర్సీ పేర్కొంది