విజయవాడలో కొత్త స్టోర్ ప్రారంభించిన మిస్సమ్మ
హైదరాబాద్, 29 జూలై 2026:
విజయవాడలో తమ రెండవ స్టోర్ ను, దేశవ్యాప్తంగా తమ 19వ స్టోర్ను ప్రారంభించినట్లు మిస్సమ్మ ప్రకటించింది. ఈ స్టోర్ ప్రారంభంతో పాటుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సాంప్రదాయ వస్త్రాలను ప్రదర్శించే ప్రత్యేక ఫెస్టివ్ షోకేస్ను కూడా సంస్థ ప్రారంభించింది.భారతదేశంలో పండుగల వస్త్రధారణ ఒకే సాధారణ శైలిని అనుసరించదు.
ప్రతి ప్రాంతానికి రంగు, వస్త్రం, నమూనాలు, అంచులు మరియు సందర్భానుసారంగా చీరను ధరించే విధానంలో దాని స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. మిస్సమ్మ యొక్క పండుగ ప్రదర్శన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు సంబంధించిన కలెక్షన్ ల ద్వారా ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ కలెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి మంగళగిరి మరియు వెంకటగిరి శైలులు, తెలంగాణకు సంబంధించి గద్వాల్ సంప్రదాయాలు, తమిళనాడు నుండి కంచి-ప్రేరిత డిజైన్లు, కర్ణాటక నుండి మైసూరు , ఉత్తరప్రదేశ్ నుండి బనారసి సంప్రదాయాలు మరియు రాజస్థాన్ నుండి కోట చీరలు ఉన్నాయి.
ఈ సందర్భంగా మిస్సమ్మ వ్యవస్థాపకుడు దిలీప్ గోలి మాట్లాడుతూ "పండుగలు అనేవి ప్రజలు తమ ఇళ్లలో, సమాజంలో చూస్తూ పెరిగినప్పటి నుండి ఉన్న అలంకరణలను తిరిగి ధరించే సమయం. గద్వాల్, కంచి, బనారసి లేదా కోటా వంటి ప్రతి అలంకరణకు దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. వినియోగదారులు ఆ తేడాలను అర్థం చేసుకుని, వారి సంప్రదాయం, సందర్భం , వ్యక్తిగత శైలికి అనుగుణంగా ఎంచుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. విజయవాడలో రెండవ స్టోర్ను, మొత్తం మీద తమ 19వ స్టోర్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ తమకు ఒక ముఖ్యమైన మార్కెట్ అనీ, ఈ కొత్త స్టోర్ నగరంలోని ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించేందుకు సహాయపడుతుందన్నారు. ఈ పండుగ ప్రత్యేక కలెక్షన్ను అన్ని మిస్సమ్మ స్టోర్లలో ,తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంచుతున్నామని దిలీప్ గోలి తెలిపారు.






