11 April, 2026 | 4:50 PM

మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి

11-04-2026 03:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): రబీ సీజన్ లో రైతులు పండించిన మొక్కజొన్నను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి అన్నారు. శనివారం మార్కెట్ యార్డులో రైతులకు టోకెన్లను జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు వ్యవసాయ శాఖ మంత్రికి విన్నవించగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు.