1 June, 2026 | 2:46 AM

చల్లంగా చూడు పోచమ్మ తల్లీ..

01-06-2026 02:03 AM

తీగలకుంటపల్లిలో  మత్తడి పోచమ్మ బోనాలు

కోహెడ, మే 31: వర్షాలు సంవృద్ధిగా కురిసి, పాడి పంటలు విరివిగా పండాలని కోరుతూ.. తీగలకుంటపల్లి రెడ్డి సంఘం, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మకు బోనాలు చేశారు. డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలు నెత్తిన భూని ర్యాలీగా ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించారు. పిల్ల-పాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం, రెడ్డి సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.