20 May, 2026 | 9:28 PM

నిరసనల వేళ రెండు బిల్లులకు లోక్‌సభ ఆమోదం

12-08-2025 01:37 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 11: లోక్‌సభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ట్యాక్సీషియన్ ట్యాక్స్ బిల్లు, ట్యాక్సీషి యన్ చట్టాలు (సవరణ) బిల్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను బిల్లులో 1961 చట్టంలో పలు సవరణలు చేశారు.

ఈ రెండు బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేస్తుండగానే అధికార పక్షం ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం. ఈ రెండు బిల్లుల ఆమో దం అనంతరం లోక్‌సభ నేటికి వాయిదా పడింది.