1 September, 2026 | 10:14 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

వైద్య చికిత్సకు ఎల్‌ఓసీ

01-09-2026 | 08:46pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం(Burgampadu mandal) సారపాక గ్రామానికి చెందిన వసంత శివ నాగేశ్వరరావు వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల విలువైన ఎల్‌ఓసీని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) మంగళవారం అందజేశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగేశ్వరరావు సతీమణి శ్రీదేవికి ఎల్‌ఓసీ పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఎల్‌ఓసీల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎల్‌ఓసీ మంజూరు చేయడంపై శ్రీదేవి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.