12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

గ్రామ గ్రామాన బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుదాం

27-04-2026 02:31 AM

కోడి అమరేందర్ యాదవ్ పిలుపు

అశ్వాపురం, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకుని రేపు ఏప్రిల్ 27, సోమవారం ఉదయం 10 గంటలకు గ్రామ గ్రామాన పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేసి, కార్యకర్తలతో కలిసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని  కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని  సూచించారు.