12 March, 2026 | 1:16 AM

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. మృతుల సంఖ్య 570కు చేరింది

11-03-2026 12:43 AM

ఉధృతంగా ఇజ్రాయెల్ దాడులు

బీరుట్, మార్చి 11: లెబనాన్‌పై మంగళవారం ఇజ్రాయెల్ ఉధృతంగా దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్లోని జనావాసాలపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లెబనాన్లో 570 మంది ప్రాణాలు కోల్పోయారు.