నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు
06-03-2026 08:22 PM
దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రానికి చెందిన సాహెబ్ గారి అక్షర- రాకేష్ ల వివాహానికి శుక్రవారం దోమకొండ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దోమకొండలోని పెద్దమ్మ కళ్యాణ మండపంలో వారి వివాహం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కుంచాల శేఖర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి స్వామి, సుధాకర్ యాదవ్, మల్లేష్ యాదవ్, కుమ్మరి రాజు, కుమ్మరి విజయ్, పోతుల రాజు, పిన్నెం రామచంద్రం, అందే గణేష్, గాలి బాలకిషన్, నేతుల అశోక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.




