10 May, 2026 | 11:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వైభవంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

05-01-2026 12:00 AM

మిడ్జిల్ జనవరి 4 : మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం  రథోత్సవం సంద ర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వేడుకలను ఘనంగా  నిర్వహించారు. రథంపై అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా తిరిగి ప్రధాన ఆలయం వరకు తిప్పారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు మంగళహారతులు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు గోవింద నామస్మరణలు బ్యాండ్ వాయిద్యం మధ్య లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి. గ్రామ సర్పంచ్ సువర్ణ. గ్రామ పెద్దలు మహేష్ కుమార్, సత్యం గౌడ్, విజయాజి, ప్రేమకుమార్, జంగయ్య, మహిళలు, యువకులు పాల్గొన్నారు.