10 March, 2026 | 4:36 AM

12 లక్షల కోట్లు హాంఫట్

10-03-2026 02:45 AM

ముంబై, మార్చి ౯: పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది. సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసాయి. ప్రారంభంలోనే బెంచ్‌మార్క్ సూచీలు తీవ్రంగా క్షీణించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ కీలకమైన 24 వేల స్థాయి కిందకు జారింది. మార్కెట్ల పత నంతో పెట్టుబడిదారుల సంపదలో ఒకేరోజులో సుమారు రూ.12 లక్షల కోట్లు ఆవిరైంది.

రంగాల వారీగా.. బ్యాంకింగ్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో అత్యధిక అమ్మకాలు న మోదయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ ప్రారంభంలోనే నాలుగు శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. జపాన్ లికీ సూచీ, దక్షణ కొరియా కోస్పీ సూచీలు బాగా పడిపోయాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి.