మైనర్లపై జరుగు నేరాలపై విద్యార్థినులకు అవగాహన
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బిచ్కుంద ఎస్సై ఆధ్వర్యంలో విద్యార్థినిలకు సైబరు నేరాలు, వేసవి కాలంలో తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశములపై ఎస్సై జి.రాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
అందుకుగాను విద్యార్థినులు సైబర్ నేరాలు మోసాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆపద కాలంలో గాని అత్యవసర సమయాల్లో విద్యార్థినులు షి టీమ్ నం.8712686094 సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం.1930 అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలి.
ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని. తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని పలు నాటికల ద్వారా పోలీస్ కళా బృందాల ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఎస్సై జి రాజు తో పాటు పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు పిసి.సాయిలు షి టీమ్.సభ్యులు PC.అనిల్ WPC.పార్వతి ప్రిన్సిపాల్ రాగిణి మరియు ఉపధ్యాయు బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.




