17-02-2026 01:53:36 PM
జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ దీశాలి అని మాజీ జెడ్పిటిసి రాథోడ్ రాము అన్నారు. మంగళవారం ఖానాపూర్ తెలంగాణ చౌక్ వద్ద టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కెసిఆర్ మళ్ళీ పాలన పగ్గాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పుప్పాల గజేందర్, ఖలీల్ ,మాజీ ఎంపీపీ రవీందర్ ,రాజ్ కుమార్, లింగన్న ,వసంత్, దివాకర్, బొమ్మెన రాకేష్ ,తదితరులు ఉన్నారు.