13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ రైలు ప్రారంభం

14-03-2026 02:06 AM

అస్సాంలో ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాం తి): అస్సాం, తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర ధాని నరేంద్ర మోదీ శుక్రవారం అస్సాంలో ప్రారంభించారు. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు సేవలను అందిస్తుంది.

ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ఏపీలోని శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దు వ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరులో ఆగుతుండగా, తెలంగాణలో నల్లగొండలో ఆగనున్నది.