14 March, 2026 | 10:35 AM

కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ రైలు ప్రారంభం

14-03-2026 02:06 AM

అస్సాంలో ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాం తి): అస్సాం, తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర ధాని నరేంద్ర మోదీ శుక్రవారం అస్సాంలో ప్రారంభించారు. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైలు సేవలను అందిస్తుంది.

ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు ఏపీలోని శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దు వ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరులో ఆగుతుండగా, తెలంగాణలో నల్లగొండలో ఆగనున్నది.