అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఇవాళ్లితో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకోవడం జరుగుతోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy Resigns) తెలిపారు. మంత్రులు జీవన్ రెడ్డిని బుజ్జగించిన ఆయన తగ్గలేదు. ఇకపై తనది పోరాట బాట అన్నారు. గ్రామాలకు వెళ్తూ ప్రజల అభిప్రాయం తీసుకుంటానని సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 20 నెలలుగా మానిసిక వేదనకు గురయ్యానని చెప్పారు.
తన మానసిక క్షోభకు తెరదించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. గౌరవం లేని చోట ఎందుకు కొనసాగాలన్నారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరిప్పుడే రాజీనామా చేయాలనుకున్నానని వివరించారు. మంచి మెజార్టీ ఉన్నా ఫిరాయింపులు చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం లేకుండా అది జరగదన్నారు. రాహుల్ ఆలోచనలకు భిన్నంగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.




