7 August, 2026 | 3:25 PM

Breaking News

ఎరువుల యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి   •   పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఉద్యమ పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం   •   అలుగుపడిన ఇల్లందులపాడు చెరువు.. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు   •   చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం   •   వాట్సాప్‌లో MeeSeva సేవలు.. పేపర్‌లెస్ గవర్నెన్స్‌కు పెద్దపీట   •   ఆర్టీసీ తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజ్   •   హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలి: బీజేపీ ఆందోళన   •   విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పోచారం   •   నల్ల బ్యాడ్జీలతో రేజర్ల పాఠశాల ఉపాధ్యాయుల నిరసన   •   బాన్సువాడ మండలంలో 23 పూరి గుడిసెలను గుర్తించాం   •  

మానవత్వాన్ని చాటిన జగ్గారెడ్డి

07-08-2026 12:00 AM
  1. అర్ధరాత్రి పసికందు ప్రాణం కాపాడిన నేత 
  2. కారులో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయాలని ఆదేశం

సంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): అర్ధరాత్రి వేళ ఓ పసికందుకు సకాలంలో చికిత్స అందేలా చేసి, ఆపదలో తానున్నాన్న పేరును మరోమారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సార్థకం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి వేళ ఓ చంటిబిడ్డను ఎత్తుకొని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం ఓ మహిళ వచ్చింది. ఎటువెళ్లాలో తెలియక చంటిబిడ్డను ఎత్తుకొని గేటువద్ద ఉన్న మహిళల వార్డులో దీనంగా నిలబడింది.

ఇంతలో దేవుడు పిలిచినట్లు జగ్గారెడ్డి అర్థరాత్రి సమయంలో తనిఖీలకు వచ్చారు. ఇంతలో మహిళ పరిస్థితిని గమనించారు. ఏమైందని ఆరాతీశారు. ఆమె తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన జగ్గారెడ్డి తన కారులో మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తల్లిబిడ్డలను తీసుకువెళ్లి, రెండో అంతస్తులోని పిల్లల వార్డులో చేర్పించి, వైద్యులకు చికిత్సలు చేయాలని ఆదేశాలిచ్చారు.

వెంటనే వైద్యులు చికిత్సలు మొదలు పెట్టారు.అనంతరం డ్రైవర్ అయిన మహిళ భర్తతో జగ్గారెడ్డి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆసుపత్రికి రావాలని సూచించారు. దీంతో జగ్గారెడ్డిలోని మానవత్వాన్ని పలువురు కొనియాడారు.