30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

పాకిస్థాన్‌కు ఇక కష్టమే

26-02-2026 01:28 AM

కొలంబో, ఫిబ్రవరి 25: ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ మాత్రమే అధికారికంగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు రేసులో ఉన్నాయి. సూపర్ 8 గ్రూప్ 2లో మిగిలిన ఒక బెర్త్ కోసం న్యూజిలాండ్ రేసులో ముందుంది.

శ్రీలంకను ఓడించడం ద్వారా రన్‌రేట్‌ను బాగా మెరుగుపరుచుకుం ది. అదే సమయంలో కివీస్ విజయం పాక్ అవకాశాలను దెబ్బతీసింది. ఇప్పుడు పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలవాల్సి ఉంటుంది. అది గెలిచినా మిగిలిన సమీకరణాలు కూడా కలిసి వస్తేనే పాక్ జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పాక్ జట్టు శ్రీలంక చేతిలో ఓడినా, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించినా పాక్ కథ ముగుస్తుంది.