ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల (IPE) ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఉపాధ్యక్షురాలు యోగితా రాణా (IAS)తో కలిసిఆదివారం విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 17 వరకు జరగగా, రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26, మార్చి 18 మధ్య జరిగాయి. నెలలోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరిగిందని, 2025లో మొదటి ఏడాది 66.91 శాతం, 2026లో 66.94 శాతం, అంతేకాక 2025లో ద్వితీయ సంవత్సరం 72.43 శాతం, 2026లో 75.61 శాతం ఉత్తీర్ణతం పెరిగింది. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచే ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీన ముగిస్తుంది. అలాగే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20న చివరి తేది అని, సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభమై రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
విద్యార్థులు అధికారిక వెబ్సైట్లైన tgbie.cgg.gov.in, results.cgg.gov.in నుండి తమ హాల్ టికెట్ నంబర్లను నమోదు చేసి ఇంటర్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ, వృత్తి విద్యా (Vocational) విభాగాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించబడ్డాయి. అధికారిక వెబ్సైట్లతో పాటు, విద్యార్థులు తమ తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను, అలాగే ఉత్తీర్ణత స్థితిని IE Education పోర్టల్లో కూడా పొందవచ్చు.




