17 March, 2026 | 9:13 PM

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

17-03-2026 07:16 PM

ములకలపల్లి, (విజయక్రాంతి): మహిళలు స్వయం సహాయక సంఘాల నుంచి బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే ఆ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేయడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి (అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు) విద్యా చందన తెలిపారు. మంగళవారం జగన్నాధపురం గ్రామ పంచాయతీ లో గల 28 స్వయం సహాయ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల నుండి తీసుకున్న, బ్యాంకు లింకేజీ రుణాలను క్రమం తప్పకుండ చెల్లించినట్లయితే, ఆ సంఘాలకు వడ్డి లేని రుణాలు వస్తాయని, సభ్యురాలు అప్పు తీసుకొని సహజంగా మరణించినచో రెండు లక్షల భీమా, ప్రమాదము జరిగి మరణించినచో పది లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉందని, అలాగే ఆసక్తి ఉన్న సభ్యులు జీవనోపాదులు ఏర్పాటు చేసుకోనుటకు  పి ఎం ఎఫ్ ఎం ఈ   పి ఎం ఎం జి పి  స్కీంల ద్వారా 35% సబ్సిడీ లతో రుణాలు మంజురు చేస్తామని తెలియ చేసారు.

జగన్నాధపురంలో  20 సంఘాలు నెల, నెల అప్పు చెల్లించకుండా క్రానిక్ సంఘాలు గా ఎందుకు ఉన్నాయి?ఎందుకు కట్టలేక పోయారని?సభ్యురాలి వారీగా మాట్లాడుతూ ఈ వారం రోజులలో బకాయిలలో సగం అమౌంట్ తప్పకుండ కట్టాలని ఈ విషయం లో ఎవరైన నిర్లక్ష్యం గా ఉన్న కఠిన చర్యలు తీసుకొని, రికవరీ తప్పకుండ చేపిస్తామని తెలియచేసారు.ఈ కార్యక్రమం లో డీపీఎం -సమ్మక్క, ఏపీఎం రామ్ కుమార్, సీసీ లు, స్త్రీనిధి ఏ ఎం , వివో ఏ లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.