15 April, 2026 | 3:16 AM

ఎయిర్‌టెల్ టవర్ ఏర్పాటు నిలిపివేత

15-04-2026 12:28 AM

కాలనీ ప్రజలకు ఉపశమనం

నాగోల్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని సత్యనగర్ కాలనీలో కొత్తగా ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు జరుగుతున్నట్లు గమనించిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెంటనే డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ కు సమాచారం అందించారు. ఈ సమాచారంపై స్పందించిన పవన్ కుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

చర్చల అనంతరం ఇంటి యజమాని టవర్ ఏర్పాటు నిలిపివేయడానికి అంగీకరించారు. ఈ పరిణామంతో సత్యనగర్ కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు నాయకోటి పవన్ కుమార్‌కు ప్రజలందరూ కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.