1 July, 2026 | 11:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వనవాసికి వితరణ

15-04-2026 12:29 AM

విద్యార్థుల్లారా.. దాతల సహకారాన్ని వమ్ము చేయకండి.

విద్యార్ది నిలయ కమిటీ కార్యదర్శి మురళీకృష్ణ

చర్ల, ఏప్రిల్ 14, (విజయక్రాంతి): మారుమూల అటవీప్రాంత గ్రామాలకు చెందిన పేద ఆదివాసీ విద్యార్దుల చదువులకు సహకరిస్తున్న స్దానిక వస్త్ర వ్యాపారి గాదంశెట్టి నరసింహారావు - ప్రసన్నలక్ష్మి దంపతులు అబినందనీయులని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరంభీం విద్యార్ది నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అన్నారు.

నరసింహారావు తండ్రి దివంగత గాదంశెట్టి బాలనర్సింహం వర్థంతి సందర్భంగా వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు భోజనం, పండ్లు, స్వీట్స్ అందచేసారు. ఈ సందర్భంగా నిలయ కమిటీ ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మురళీకృష్ణ ప్రసంగించారు.

విద్యార్దుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని గాదంశెట్టి కుటుంబీకులు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ తల్లిదండ్రులు బాలనర్సింహం - సుబ్బలక్ష్మి దంపతుల వర్దంతి, జయంతి సందర్భంగా విద్యార్ది నిలయంకు వితరణలను అందచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుండటం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో కొమరం భీం విద్యార్ది నిలయం సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ కమిటీ సభ్యులు పోలిన రమాదేవి, లవన్ కుమార్ రెడ్డి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.