పంట నష్టపోయిన రైతులకు తక్షణ నష్ట పరిహారం అందించాలి
బెజ్జంకి,మే3:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట కాలిపోవడంతో బాధిత రైతులను మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సంఘటన స్థలాన్ని ఆదివారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల ను రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, అరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే లోగానే అగ్నికి ఆహుతి కావడం ఎంతో బాధాకరం.
ముగ్గురు రైతులు సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై, దాదాపు 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, వారి కుటుంబాల జీ వనాధారంపై పడిన గట్టి దెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు.కరెంట్ నిర్వహణలో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. పొలాల్లోనే వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు సరైన రీతిలో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత రైతులకు తక్ష ణ ఆర్థిక సహాయం అందించి, పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు. వారి తో మండల నాయకులు లింగాల లక్ష్మణ్,మహిపాల్ రెడ్డి,తిరుపతి రె డ్డి, కనగాండ్ల తిరుపతి,కాచ్చు రాజయ్య, మ హేందర్ రెడ్డి,తదితరులు వున్నారు.






