13 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా

31-10-2025 06:00 PM

కాసులు కురిపిస్తున్న మూసీ ఇసుక

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల్లో మూసీ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా మూసీకి వస్తున్న వరదలతో మూసీ నదిలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అయితే వరద తగ్గినప్పుడు ఇసుకను మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాదారులు సేకరించి డంపులుగా చేసుకుని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులకు మూసీ ఇసుక మూడు పువ్వులు, ఆరు కాయలుగా కాసులు కురిపిస్తుంది. వలిగొండ మండలంలోని మూసీ పరివాహక ప్రాంతాలైన గోకారం, ప్రొద్దుటూరు, లింగరాజుపల్లి, లోతుకుంట, గుర్నాథ్ పల్లి, వేములకొండ గ్రామాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కొనసాగుతుంది.

ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడం గమనిస్తే దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోనట్లు తెలుస్తుందని పలువురు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  లబ్ధిదారులకు ఇసుకను ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు ఇసుక రవాణాదారులు 6,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుండడంతో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు  చేసేది ఏమీ లేక రవాణాదారులు చెప్పిన ధరను చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూసీ నుండి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.