18 July, 2026 | 12:06 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

రాజీవ్ గాంధీ అండర్-19 టీ20 విజేత హైదరాబాద్

25-01-2025 12:00 AM

ఫైనల్లో చెన్నై జట్టుపై గెలుపు

హైదరాబాద్: 47వ ఆలిండియా రాజీవ్ గాంధీ అండర్-19 టీ20 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ నిలిచింది. ఎల్బీ స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

అనంతరం చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితమైంది. విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టును క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అభినందించారు. అంతకముందు వి.హనుమంత రావు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం హైదరాబాద్, చెన్నై ఆటగాళ్లతో వీహెచ్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.