22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ఎన్నికల బరిలో వారసులు

18-01-2026 01:07 AM

కరీంనగర్ మేయర్ స్థానంపై కన్ను

రసవత్తరంగా మారనున్న బల్దియా పోరు

కరీంనగర్, జనవరి 17 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ స్థానం బీసీ జనరల్ కావడం తో ఆయా పార్టీలకు చెందిన మం త్రులు, మాజీ మంత్రుల వారసులు ఎన్నికల బరిలోకి రావడానికి ఉత్సా హం చూపిస్తున్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు వెన్నంటి ఉండి ఆయన ప్రతి ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన సోదరుని కొడుకు గంగుల ప్రదీప్ ఈసారి బల్దియా బరిలో దిగి మేయర్ కావాలనే లక్ష్యం గా ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఈ మేరకు రిజర్వ్ కాబడ్డ బీసీ స్థానాల్లో తనకు అనుకూలమైన స్థానం నుంచి పోటీచేయాలనే ఉత్సాహంతో ఉన్నా రు. ప్రస్తుత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సోదరుడు, కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కుమారుడు పొన్నం అనూప్ బల్దియా బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన్ని బరిలో దించాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం మంత్రిపై ఒత్తిడితేవడానికి సిద్ధమవుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్ పెద్ద కుమారుడు బండి భగీరథ్ బల్దియా బరిలోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. బండి సంజ య్ నిర్ణయంపైనే కుమారుని ఆరంగేట్రం ఆధారపడి ఉంటుం ది. ఆయా పార్టీల్లో మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగానే ఉన్నా వారసులు రాబోతున్నారన్న ప్రచారంతో బల్దియా పోరు రసవత్తరంగా మారే అకాశాలున్నాయి.