17-02-2026 12:17:56 PM
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం భారీగా పోలీసులు మోహరించారు. సోమవారం జరిగిన అవాంఛనీయ ఘటన నేపథ్యంలో వాయిదా పడ్డ ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో 144వ సెక్షన్ విధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్ అయ్యారు. సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి, రవిచంద్ర హౌస్ అరెస్ట్ అయ్యారు.