15 April, 2026 | 12:09 AM

తెలంగాణకు ప్రజలకు హెచ్చరిక.. ఎల్లుండి నుంచి భానుడి భగభగలు

14-04-2026 03:12 PM

మండుతున్న ఎండలు, భానుడి భగభగలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఉమ్మడి నిజామాబాద్ లో 42.4, ఆదిలాబాద్ లో 42.3, ఉమ్మడి మహబూబ్ నగర్ లో 41, ఖమ్మంలో 40.4, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎల్లుండి నుంచి మరింత ఎండలు ఠారెత్తించనున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు(Heat Wave Alert) వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.