1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

67 మంది యువతులకు వల.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో న‌కిలీ పోలీస్ అరెస్ట్

14-04-2026 02:05 PM

67 మంది మహిళలను మోసం చేసిన న‌కిలీ అధికారి 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూనిఫాంలో హడావిడి

మ్యాట్రిమోనీలో యువతులకు వల

శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: మ్యాట్రిమోనీలో సైట్ లో పోలీస్ వేషంతో యువతులకు వల వేస్తూ 67 మంది మహిళలను పెళ్లిళ్లపేరుతో మోసం చేస్తున్న న‌కిలీ CISF అధికారి గుట్టు రట్టు అయింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణగా గుర్తించబడిన నిందితుడు, సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి విమానాశ్రయ ప్రాంగణంలో హడావిడి చేస్తూ కనిపించాడు. బాలకృష్ణ తీరుపై సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం కలిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను అధికారిక సిబ్బంది కాదని అధికారులు గుర్తించారు. 

ప్రాథమిక దర్యాప్తులో, నిందితుడు మ్యాట్రిమోనియల్ వేదికలను ఉపయోగించుకుని పలువురు మహిళలను సంప్రదించి, మోసగించినట్లు బయటపడింది. తన మొదటి భార్య నుండి విడిపోయిన తర్వాత, తిరిగి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో అతను ఒక సీఐఎస్ఎఫ్ అధికారిగా నటిస్తూ వచ్చాడని పోలీసులు తెలిపారు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అతని మొబైల్ ఫోన్‌లో వందలాది మంది మహిళలతో జరిపిన చాట్‌లు ఉన్నట్లు తెలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.