ఖానాపూర్ ఎమ్మెల్యేను సన్మానించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్
26-08-2026 06:35 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ను బుధవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ స్వర్ణ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకరించాలని కోరారు. ఆమె వెంట ఆసుపత్రి మాజీ సూపర్డెంట్, వైద్యులు వంశీ, తదితరులు ఉన్నారు.






