26 May, 2026 | 6:22 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

గరిడేపల్లి మండలం మర్రికుంటలో దేవత విగ్రహాలు

06-11-2025 12:53 AM

గరిడేపల్లి, నవంబర్ 5 : మండల పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలో గల సాగర్ ఎడమ కాలువ వద్ద ఇటీవల రెండు దేవత మూర్తులు నీటిలో లభ్యం కావడంతో స్థానిక గ్రామస్తుల్లో ఆసక్తి చెలరేగింది. కాలువలో ప్రవహిస్తున్న నీటితో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్న ఈ విగ్రహాలు అమ్మవారికి చెందినవిగా కనిపిస్తున్నాయి.విగ్రహాలు కనిపించడంతో సమీపంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు కలిసి వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.

అయితే ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి,ఎవరు ఎలా ఉంచారు.అన్నది స్పష్టత కలగాల్సి ఉంది.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం కాలువ పైప్రాంతంలోని ఏదైనా దేవాలయం పునర్నిర్మాణం లేదా నీటి ప్రవాహం కారణంగా విగ్రహాలు ఇక్కడికి చేరి ఉండవచ్చని భావన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఈ ఘటనను ఆధ్యాత్మిక సంయోగంగా భావిస్తున్నారు.సంబంధిత శాఖలు మరియు అధికారులు విగ్రహాల మూలాన్ని కనుగొనడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.