14 July, 2026 | 4:23 PM

Breaking News

పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

గరిడేపల్లి మండలం మర్రికుంటలో దేవత విగ్రహాలు

06-11-2025 12:53 AM

గరిడేపల్లి, నవంబర్ 5 : మండల పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలో గల సాగర్ ఎడమ కాలువ వద్ద ఇటీవల రెండు దేవత మూర్తులు నీటిలో లభ్యం కావడంతో స్థానిక గ్రామస్తుల్లో ఆసక్తి చెలరేగింది. కాలువలో ప్రవహిస్తున్న నీటితో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్న ఈ విగ్రహాలు అమ్మవారికి చెందినవిగా కనిపిస్తున్నాయి.విగ్రహాలు కనిపించడంతో సమీపంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు కలిసి వాటిని జాగ్రత్తగా బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.

అయితే ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి,ఎవరు ఎలా ఉంచారు.అన్నది స్పష్టత కలగాల్సి ఉంది.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం కాలువ పైప్రాంతంలోని ఏదైనా దేవాలయం పునర్నిర్మాణం లేదా నీటి ప్రవాహం కారణంగా విగ్రహాలు ఇక్కడికి చేరి ఉండవచ్చని భావన వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు ఈ ఘటనను ఆధ్యాత్మిక సంయోగంగా భావిస్తున్నారు.సంబంధిత శాఖలు మరియు అధికారులు విగ్రహాల మూలాన్ని కనుగొనడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.