9 May, 2026 | 11:24 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

వార్డుల పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశాం

16-12-2025 11:33 AM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం(GHMC Special Council Meeting) ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో వార్డుల విభజనపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) మాట్లాడుతూ... వార్డుల సంఖ్య పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. సరిహద్దులు, తదితర వివరాలు జీవో 266లో పొందుపరిచామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వార్డుల పెంపుపై అభ్యంతరాల స్వీకరణ రేపటితో ముగుస్తోందన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల(GHMC wards) సంఖ్యను ప్రభుత్వం 300కు పెంచిందని  జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.