రాజేంద్రనగర్ పరిధిలో ఆక్రమణల తొలగింపు
25-04-2026 | 11:05am
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendra Nagar) పరిధిలో ఆక్రమణలను తొలగించారు. బండ్లగూడ, కాళీ మందిర్, టిప్పూఖాన్ పూల్, సన్ సిటీ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. SR నగర్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై ఫుట్ పాత్ మార్గాల ఆక్రమణలను GHMC తొలగించింది.






