2 September, 2026 | 11:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

Telangana Census 2026: మే 11 నుంచి ప్రతి ఇంటికి మార్కు

25-04-2026 | 12:31pm

హైదరాబాద్: జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతి హొలికేరి(Bharathi Hollikeri) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనాభా లెక్కల సేకరణ వివరాలను వెల్లడించారు. ఆస్పత్రి బడి, గుడి, గుడిసె, అద్దె భవనం ఏదైనా గణన జరుగుతోందని చెప్పారు. తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇల్లు గణన ఉంటుందని సూచించారు. భవనంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంటామని వివరించారు.

2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధంగా చేస్తామని భారతి హొలికేరి వెల్లడించారు. 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరిస్తామన్నారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తామని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారని జనగణన తెలంగాణ డైరెక్టర్ వెల్లడించారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది మార్కు చేస్తారని సూచించారు.