15-02-2026 12:00:00 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, వర్షపు నీటి కాలువల నిర్మాణంపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి క్షేత్ర స్థాయిలో విస్తత పర్యటన చేశా రు. నాగో ల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన.. చెత్త నిర్వహణ తీరుతెన్నులను, అభివృద్ధి పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు.
ముందుగా మన్సూరాబాద్ ఆటోనగర్లోని డంపింగ్ యార్డ్ను కమిషనర్ సం దర్శించారు. అక్కడ ప్రతిరోజూ సేకరిస్తున్న చెత్త, వ్యర్థాల నిర్వహ ణ కార్యకలాపాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. యార్డులో ఉన్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. చెత్త నిర్వహణ బేషుగ్గా చేపట్టాలని కోరారు.
అనంతరం నాగోల్ సర్కిల్, సౌతెండ్ పార్క్ కాలనీలో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ఈ డ్రైన్ పను లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగోల్ సర్కిల్ నెం.11 డిప్యూ టీ కమిషనర్ రవీందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సీఈ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.