14 June, 2026 | 4:17 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

పెళ్లి పేరుతో.. సహజీవనం

12-06-2026 12:00 AM

రూ.40 లక్షలు నగదు, బంగారం తీసుకొని దూరమయ్యాడని మహిళ ఆరోపణ

మేడిపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సహజీవనం చేసి రూ.40 లక్షలు నగదు, బంగారం తీసుకొని మోసం చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్, ఉదయ్ నగర్ కు చెందిన సిస్టు వెంకటభారతి, భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసిస్తుంది.

సోషల్ మీడియా ద్వారా  2019లో భారతికి, షేక్ మహబూబ్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి, సహజీవనం చేశామని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.40 లక్షల నగదు, 2.50 తు లాల బంగారం తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. అతను కొంతకాలంగా వేరే ఆమె తో సంబంధం కొనసాగిస్తున్న విషయం తనకు తెలిసిందని, అప్పటినుండి తనను పట్టించుకోవడం లేదని, మోసoచేశాడని భారతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.