18 July, 2026 | 6:23 PM

Breaking News

అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •  

పొదుపుతోనే ఆర్థిక భద్రత

24-01-2026 12:06 AM

రేవల్లి జనవరి 23: ప్రజల్లో పొదుపు అలవాట్లు, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కొరకు మం డలంలోని తల్పునూర్ గ్రామంలో శుక్రవారం ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నాగర్కర్నూల్ రీజినల్ పరిధిలోని పెద్దమందడశాఖ ఆధ్వ ర్యంలో, నాబార్డు సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఈవెంట్ కళాజాత బృందం ప్రదర్శించిన ఆటపాటతో మ్యాజిక్ షోలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వ్యవసాయ రుణాల లభ్యత, చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలు. వ్యక్తిగత రుణాలు, తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాల గురించి అవగాహన కల్పించారు. మొబైల్ బ్యాంకింగ్, రూపేకార్డుల వినియోగo, సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను మ్యాజిక్ షో ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక భద్రతను కలిగి ఉండాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడ బ్రాంచ్ మేనేజర్, ఫీల్ ఆఫీసర్, బ్యాంక్ సిబ్బంది, డ్వాక్రా ఏపీవో, స్వయం సహాయక సంఘాల మహిళలు, తలుపునూరు గ్రామస్తులున్నారు.