9 May, 2026 | 11:25 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఎస్‌ఆర్‌ఆర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

22-01-2026 01:47 AM

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల మాజీ వార్డ్ నెంబర్ ఎండీ జహంగీర్ మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో వార్డ్ మెంబర్‌గా పెందోటా శ్రావణి శివ గెలుపొందిన సందర్భంగా ఆమెను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గజవెల్లి ప్రసాద్, చందు రాము, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.