10 May, 2026 | 5:29 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నవంబర్ 2న ఫైనల్

03-06-2025 12:00 AM

2025 మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ వేదికలు, తేదీలు ఖరారు

దుబాయ్, జూన్ 2: ఈ ఏడాది భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు, తేదీలను ఐసీసీ సోమవారం ఖరారు చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఐదు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), గుహవాటిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ కొలంబోలోని ప్రేమదాస మ్యా చ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ గుహవాటి లేదా కొలంబో, రెండో సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్‌కు బెంగళూరు లేదా కొలంబో ఆతిథ్యమివ్వనుంది.