25 July, 2026 | 6:00 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

23-01-2026 12:00 AM

దేవరకొండ, జనవరి 22 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ పార్టీ కార్యాలయంలో  ప్రభుత్వం నుంచి మంజూరు అయిన స్పింక్లర్స్ ను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులని అభివృద్ధి దిశగా పయనించే మార్గం కాంగ్రెస్ పార్టీ తీసుకుందని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.

దీనిలో భాగంగా రానున్న రోజులలో రైతులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోదేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమున మాధవ రెడ్డి మాజీ జడ్పీటీసీ గుంజ నారాయణ రేణుక మండల పార్టీ అధ్యక్షులు లోకసాని  శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ వంకూడవత్ పాప నాయక్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి రైతులు  నాయకులు తదితరులు పాల్గొన్నారు.