రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకూడదు
17-03-2026 05:32 PM
మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పాలక వర్గ సమావేశం నిర్వహించారు. వచ్చే సీజన్లో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై చర్చిస్తూ, కేంద్రాలకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను సకాలంలో ఏర్పాటు చేయాలని మార్కెట్ సిబ్బందికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సంతోష్, మల్లేశం, పోచయ్య, రాజు, నర్సయ్య, చంద్రారెడ్డి, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.




