టమాటాకు ధరలేక పంటను పంచిన రైతు
25-02-2026 12:03 AM
తరిగొప్పుల, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): టమాటాలకు ధర లేక తెంపిన కూళ్లు కూడా నష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మండలంలోని నర్సాపూర్ గ్రా మానికి చెందిన శెట్టి సదయ్య ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో టమాట పం ట పెట్టడం జరిగింది. కూలీలకు 5000 రూ పాయల పొగ వెయ్యి రూపాయలు ట్రా న్స్పోర్ట్ చార్జీలు కలిపి మొత్తం మంగళవారం మండల కేంద్రంలో ఉన్న సంతలో అమ్మడానికి తీసుకురాగా వందకు మూడు పెట్టలు అనగానే రైతు చేసేది ఏమీ లేక సుమారు 80 పెట్టెల టమాటాలను బస్టాండ్ ఆవరణలో అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. జనం కొనడానికి ముందుకు రాకున్నా కూ డా ఉచితంగా పంపిణీ అనేసరికి తండోపతండాలుగా వచ్చి అర్థగంటలోనే ఉన్న ట మాటాలను తీసుకెళ్లారు.




