30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

11-05-2026 07:52 PM

సదాశివ నగర్ లో విషాదఛాయలు

సదాశివ నగర్,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ గ్రామానికి చెందిన కురుమ  జోగిని లింగం (50) అనే రైతు ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు తిరిగి ఇంటికి రాలేదు. బావి పక్కనే వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు జారీ  బావిలో పడి మృతి చెందారు.

కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో భావి వద్దకు వెళ్లి వెతకగా భావి వద్ద జారిపోయి పడిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతికారు. లింగం శవం బావిలో బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు లింగం మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు. రైతు లింగం మృతి చెందడంతో సదాశివ నగర్ లో విషాద ఛాయలు అ లుముకున్నాయి.