28 March, 2026 | 1:20 PM

చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి

28-03-2026 11:06 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో(Chittoor district) శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల ముగ్గురిని వరంగల్ కు చెందిన శ్రీదర్ రావు, లక్ష్మి, ఆద్వికగా గుర్తించారు. వరంగల్ కు చెందిన శ్రీధర్ రావు కుంటుంబం బెంగళూరులో స్థిరపడింది. వేగంగా దూసుకొచ్చిన వీరి కారు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వస్తుండగా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.