29 April, 2026 | 8:12 PM

Breaking News

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక   •   అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి   •   అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   సుల్తానాబాద్ మండలంలో 10 ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం   •   పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం   •   పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం   •   పేదింటి ఆడబిడ్డకు అండగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు   •   సోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలికలు   •   పది ఫలితాల్లో 91.8శాతం ఉత్తీర్ణత   •   సీనియర్ అసిస్టెంట్ యాదగిరి సార్ సేవలు మరువలేం   •  

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలి

29-04-2026 06:30 PM

మంగపేట,(విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని  మంగపేట రెండవ యస్ఐ శ్రీకాంత్ అన్నారు. యువత చెడు మార్గంలో ప్రయాణించడంలో డ్రగ్స్ ప్రభావం అనే విషయంపై ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో  యువతకు, ఆటో డ్రైవర్లకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ యువత గంజాయి, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ రవాణ చేస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.