22 April, 2026 | 1:08 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

09-04-2026 01:42 PM

కోహెడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కోహెడ ఎన్టీఆర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)ను పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా వరుసగా కార్యక్రమన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత అంశాలతో పాటుగా.. భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు అవగాహన పెంపొందించుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏం దర్శనాల నారాయణ ఉపాధ్యాయులు గీత, శోభ, తిరుమల విద్యార్థులు పాల్గొన్నారు.