ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం
24-04-2026 08:12 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంను గ్రామీణ కూలీలు సద్వినియోగం చేసుకోని ఉపాధి పొందాలని సూచించారు.






