14 July, 2026 | 4:42 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ముంబై గృహ మార్కెట్‌లో ఎంబసీ డెవలప్‌మెంట్స్ పెట్టుబడులు

20-01-2026 01:43 PM

ముంబై: బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో తమ వ్యాపారాన్ని విస్తరించే వ్యూహంలో భాగంగా రియల్టీ సంస్థ ఎంబసీ డెవలప్‌మెంట్స్ మంగళవారం ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. మూడు కొత్త లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులను నిర్మించడానికి, కొనసాగుతున్న మూడు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

ఎంబసీ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ (EDL) త్వరలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లోని జుహు, వర్లి, అలీబాగ్‌లలో మూడు ప్రాజెక్టులను ప్రారంభించనుంది. గతంలో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్‌గా ఉన్న ఈడీఎల్, దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడింది.

బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌కు వీవర్క్ ఇండియా, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఆర్‌ఈఐటీ అనే మరో రెండు లిస్టెడ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈడీఎల్ ఛైర్మన్ జితు విర్వానీ మాట్లాడుతూ... ముంబైలో వృద్ధి తదుపరి అధ్యాయానికి మేము సిద్ధంగా ఉన్నామని  పేర్కొన్నారు. గృహాలకు డిమాండ్ బలంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. ముంబై తమకు ముఖ్యమైన మార్కెట్ అని, తాము ఎంఎంఆర్‌లో రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నామని ఆయన వెల్లడించారు.